న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్ నెల ఆర్థిక సమీక్షలో విశ్లేషించింది. మేలో ద్రవ్యోల్బణం, టోకు ధరల సూచీ ఏకంగా వరుసగా 6.3, 12.94 శాతానికి ఎగబాకడం ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు లీటర్కు రూ వంద దాటడంతో ఇంధన ధరలు మండుతున్నాయని పేర్కొంది.
రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటం, ఖరీఫ్ సాగు క్రమంగా పెరుగుతుండటం, అన్లాక్ ప్రక్రియ వేగవంతమవుతుండటంతో ధరలు దిగివస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది. కరోనా కలకలం నుంచి తేరుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు వ్యాక్సినేషన్ను వేగవంతంగా కొనసాగించడం, ఆరోగ్య మౌలిక వసతుల మెరుగుదల వంటి సవాళ్లను అధిగమించాల్సి ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, ఎరువుల సబ్సిడీ పెంపు వంటి చర్యలతో రాబోయే త్రైమాసికాల్లో గ్రామీణ డిమాండ్ బలోపేతమవుతుందని అంచనా వేసింది.