సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 8: పల్లె ప్రగతి పనులపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులపై సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు కొరడా ఝుళిలిపిస్తున్నారు. గురువారం జిల్లాలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు. ఏడుగురు మండల పంచాయతీ అధికారుల (ఎంపీవోలు)తోపాటు ఇద్దరు సర్పంచ్లు, మరో 12 మంది పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు జారీచేశారు.