ముంబై, జూలై 6: ఆరంభంలో అదరగొట్టిన స్టాక్ మార్కెట్లు.. ఆఖర్లో స్వల్ప నష్టాలతో సరిపెట్టాయి. మంగళ వారం ట్రేడింగ్లో సరికొత్త శిఖరాలను తాకిన సూచీలు.. మదుపరుల అమ్మకాల ఒత్తిడితో మళ్లీ పడిపోయాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 53,000 పాయింట్ల స్థాయిని అధిగమించి తొలిసారిగా 53,129 పాయింట్లను చేరింది. చివరకు 19 పాయింట్ల స్వల్ప నష్టంతో 52,861 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అలాగే నిఫ్టీ తొలిసారిగా 15,914 పాయింట్లను తాకింది. చివరకు 16 పాయింట్ల నష్టంతో 15,818 పాయింట్ల వద్ద ముగిసింది.