వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రక్రియను వేగవంతం చేసిన బల్దియా.. ప్రజల వద్దకే టీకా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందుకోసం 23 చోట్ల మొబైల్ వ్యాన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని రద్దీ ప్రాంతాల్లో ఉంచి..30 ఏండ్లు దాటిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి జోన్లలో ప్రతి మొబైల్ వ్యాన్ ద్వారా నిత్యం 300 మందికి టీకా ఇవ్వడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్నది.
నగరంలో 27న మరోసారి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్స్ చేపట్టనున్నారు. హైటెక్స్, బాలానగర్ బోజై ఫంక్షన్హాల్, ఎల్బీ స్టేడియం వేదికలుగా ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. https://medicoveronline.com/mega-drive, www.txhospitals.inలో వివరాలు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.