సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు వరుణుడి అడ్డుతొలడం లేదు. సౌతాంప్టన్లో ఇంకా వర్షం కురుస్తోంది. దీంతో అయిదవ రోజు ఆట కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే వర్షం వల్ల రెండు రోజుల ఆటను కోల్పోయారు. ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 217కు ఆలౌటైంది. కివీస్ రెండు వికెట్లు కోల్పోయి 101 రన్స్ చేసిన విషయం తెలిసిందే. రిజర్వ్ డే ఉన్నా.. మ్యాచ్ మాత్రం డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి.