ముంబై ,జూన్ 18: ఈరోజు స్టాక్ మార్కెట్లు స్వల్పలాభాల్లో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్ 145 పాయింట్ల మేర నష్టంతో 52,177 వద్ద, నిఫ్టీ 59 పాయింట్ల మేర కోల్పోయి15,632 వద్ద కదలాడుతున్నాయి. గత రెండు సెషన్లలో భారీనష్టాలను మిగిల్చిన దేశీ సూచీలు వారాంతపు సెషన్ లో లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 212,నిఫ్టీ 46 పాయింట్లు మేర లాభాలను నమోదు చేశాయి. అయితే ఆరంభ లాభాలు అవిరి కావడంతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.