ముంబై, జూన్ 17: ఈరోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు నిరాశే మిగిల్చాయి. మళ్లీ భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఓ సమయంలో కాస్త కోలుకున్నట్లుగా కనిపించినప్పటికీ ఏ దశలోను కోలుకోలేదు.సెన్సెక్స్ 170 పాయింట్లకు పైగా,నిఫ్టీ 13 పాయింట్లకు పైగా నష్టపోయింది. అయినప్పటికీ సెన్సెక్స్ 52వేల పాయింట్లకు పైన,నిఫ్టీ 15,700 పాయింట్ల పైన ఉన్నది. అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీరేట్లను పెంచనుందనే సంకేతాలు భారత్, ఆసియా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. చమురు ధరల్లో పెరుగుదల సూచీలపై ప్రభావం చూపాయి. అయితే ప్రస్తుతానికి వడ్డీ రేటును దాదాపు సున్నా వద్ద ఉంచి ప్రతినెలా 120 బిలియన్ డాలర్లు విలువైన బాండ్స్ కొనుగోలు చేయనుంది.