నారాయణపేట, జూన్ 14: సివిల్ సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలని ఫిర్యాదుదారులకు ఎస్పీ చేతన సూచించారు. సోమవా రం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ఆస్తితగాదాలకు సంబంధించి 5 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుదారులతో ఎస్పీ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్ర జావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చ ట్టప్రకారం పరిష్కరించి, బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని సీఐ, ఎస్సైలను ఆదేశించారు. కొవిడ్ 19 కారణంగా ఫిర్యాదుదారులు ఫిర్యాదు బాక్సులను వినియోగించుకోవాలని, తమ ఫిర్యాదులను గ్రామాల్లో లేదా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన నీ నేస్తం (ఫిర్యాదు పెట్టె) బాక్సుల్లో వేయాలన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు.