అజ్వల్: 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు కలిగి ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబానికి అధిపతిగా పేరుగాంచిన మిజోరాం రాష్ట్రానికి చెందిన 76 ఏండ్ల జియోనా చనా ఆదివారం మరణించారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అజ్వల్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. సెర్చిప్ జిల్లాలోని బక్తాంగ్ త్లాంగ్నుమ్ గ్రామంలో నివసిస్తున్న జియోనా చానాకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలతోపాటు పెద్ద సంఖ్యలో మనుమలు,మనవరాళ్ళు ఉన్నారు. దీంతో ప్రపంచంలోనే అది పెద్ద కుటుంబంతో నివాసం ఉంటున్న ఆయన గ్రామం బక్తాంగ్ త్లాంగ్నుమ్ మిజోరాంలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది. కాగా, జియోనా చానా మరణంపై మిజోరాం సీఎం జోరంతాంగ సంతాపం తెలిపారు. ఆయన పెద్ద కుటుంబం వల్ల బక్తాంగ్ త్లాంగ్నుమ్ గ్రామం రాష్ట్రంలోనే ప్రధాన టూరిస్ట్ కేంద్రంగా మారిందని కొనియాడారు.