ఉప్పల్, జూన్ 11: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ మేరకు హబ్సిగూడ ఎస్ఆర్ అపార్ట్మెంట్కు చెందిన వెంకట్రావుకు రూ.32వేల చెక్కును ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణకు తగిన తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మందిని ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వనంపల్లి గోపాల్రెడ్డి, గరిక సుధాకర్, లక్ష్మినారాయణ, లింగానాయక్, కొంగల శ్రీధర్, రవినాయక్, నందికంటి శివ, రెహమాన్, పల్లె నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఆసరగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మీర్పేట్-హెచ్బీకాలనీ డివిజన్ కైలాసగిరికి చెందిన డి.ఎల్లయ్యకు రూ.16,500, ఇందిరానగర్కు చెందిన జి.శ్రీనివాస్కు రూ.20వేలు మంజూరైన చెక్కులను కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్తో కలిసి అందజేశారు. కార్యక్రమంలో గరిక సుధాకర్, లక్ష్మినారాయణ, నందికంటి శివ, ఎండీ రహమాన్, పల్లె నర్సింగరావు, బాలరాజు, సాయికుమార్, లింగ నాయక్, కొంగల శ్రీధర్, జేసీబీ రాజు, రవినాయక్, తదితరులు పాల్గొన్నారు.