ఖమ్మం ఏఎంసీలో క్వింటాకు రూ.7,250
రాష్ట మార్కెటింగ్శాఖలో ఇదే అత్యధిక ధర
సీసీఐ మద్దతు ధర కంటే రూ.1,500 అదనం
ఖమ్మం వ్యవసాయం, జూన్ 7: నగర వ్యవసాయ మార్కెట్లో పత్తిపంట (తెల్ల బంగారం) ధర చరిత్ర సృష్టించింది. యావత్ రాష్ట మార్కెటింగ్శాఖలోనే పత్తి పంటకు ఇంత ఎక్కువ మొత్తంలో ధర పలకడం విశేషం. ఈ ఏడాది భారత పత్తి సంస్థ(సీసీఐ) మద్దతు ధర క్వింటాకు రూ.5,725 చొప్పున కొనుగోలు చేశారు. సాధారణంగా సీసీఐ మద్దతు ధర కంటే ప్రైవేట్ మార్కెట్లో కొంత మేర తక్కువ ధర పలకడం సర్వసాధారణం. అయితే, అధికారులు, సహా వ్యాపారులు, సాగు రైతులు ఊహించని ధర నమోదు కావడంతో నేటి వరకు పంటను దాచుకొన్న రైతులకు కాసుల వర్షం కురిసినైట్లెంది. దాదాపు నెలరోజుల తర్వాత ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తిరిగి పత్తి, అపరాల క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. వారం రోజుల కిత్రం మిర్చి క్రయవిక్రయాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మార్కెట్లో పంట ఉత్పత్తులు లేకపోవడం, జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తికి మంచి డిమాండ్ పలుకుతుండడంతో ఖరీదుదారులు కొనుగోలుకు పోటీపడ్డారు.
తద్వారా ఉదయం జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్లో మొదటి రకం పంటకు క్వింటాకు రూ.7,200 పలికింది. రాష్ట్ర మార్కెటింగ్ చరిత్రలోనే ఇదే అత్యధిక ధర అని వ్యాపారులు తెలిపారు. రైతులు యార్డుకు సుమారు 650 బస్తాలు తీసుకురాగా.. క్వింటాకు రూ.6వేల పైబడి ధరతో వ్యాపారులు కొనుగోలు చేశారు. సీసీఐ కంటే క్వింటాకు ఒక్కంటికి రూ.1,500 ధర అధికంగా పలకడంతో పంటను తీసుకొచ్చిన రైతుల్లో సంతోషం వెల్లివిరిసింది. మార్కెట్ పున:ప్రారంభం తొలిరోజునే ఇంత ధర రావడంతో రానున్న రోజుల్లో మరింత ధర పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.