న్యూఢిల్లీ: కరోనా రెండ్వేవ్తో సతమతం అవుతున్న భారత్, దానికి ఉన్న టాలెంట్ పూల్.. ప్రపంచాన్నే ఆశ్చర్య పరుస్తుందని గ్లోబల్ ఐటీ సంస్థ డెల్లాయిట్ సీఈవో పునీత్ రెజెన్ విశ్వాసం వ్యక్తం చేశారు. మున్ముందుకు రెట్టింపుకు పైగా నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం డెల్లాయిట్ ఇండియా పరిధిలో సుమారు 50 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మున్ముందు 75 వేల మందిని నియమించుకోనున్నట్లు పునీత్ రెన్జెన్ తెలిపారు. తమ బిజినెస్ను ఎలా పునః మదింపు చేయాలో నిర్ణయించుకునేందుకు కరోనాను ఒక అవకాశంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
గత ఐదేండ్లతో పోలిస్తే మానవాళిపై విశ్వరూపం ప్రదర్శిస్తున్న కరోనా మహమ్మారి వచ్చిన గత 14 నెలల్లోనే చాలా డిజిటలైజేషన్ జరిగిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగానూ, ఆసియా ఖండంలోనూ హెల్త్కేర్ మౌలిక వసతుల కల్పనకు నిధులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.