ముంబై ,జూన్ 5: లగ్జరీ కార్ బ్రాండ్ బీఎమ్డబ్ల్యూ తమ కార్లకు ఉపయోగించే టైర్ల స్థానంలో ఎకో ఫ్రెండ్లీ టైర్లను వినియోగించనున్నట్లు తెలిపింది. ఎక్కువ కాలం మన్నిక ఉండేలా , పర్యావరణ హితం కోసం ఈ టైర్లను రూపొందించినట్లు బీఎమ్డబ్ల్యూ వెల్లడించింది .
టైర్ల తయారీలోప్రసిద్దిగాంచిన పీరెల్లి సంస్థ బిఎమ్డబ్ల్యూ కోసం న్యాచురల్ రబ్బర్తో ఎకో ఫ్రెండ్లీ టైర్లను రూపొందించింది. ఈ ఏడాది ఆగస్టు నాటికి మార్కెట్లోకి రానున్న బిఎమ్డబ్ల్యూ ఎక్స్5 ఎక్స్డ్రైవ్45ఈ ప్లగ్-ఇన్-హైబ్రిడ్ కారులో ఈ పీరెల్లీ 22 ఇంచ్ ఎకో ఫ్రెండ్లీ టైర్లను ఉపయోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.