కల్యాణలక్ష్మితో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆసరా
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
పలువురు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
నర్సంపేట/ఖానాపురం, మే27 : పేదింటికి సీఎం కేసీఆర్ పెద్దదిక్కుగా ఉంటున్నారని. కల్యాణలక్ష్మితో ఆడబిడ్డల పెళ్లిళ్లలకు ఆసరాగా నిలుస్తున్నార ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 208 మందికి, ఖానాపురం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి చెక్కులు క్లియర్ చేయాలని సీఎంను కోరగా, వెంటనే రూ. 5.10 కోట్ల విలువైన చెక్కులను మంజూరు చేసినట్లు చెప్పారు. కరోనా వేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. బ్యాంకులు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పనిచేస్తున్నాయని, ఈ రోజే లబ్ధిదారులు బ్యాంకులో చెక్కులను డిపాజిట్ చేయాలని సూచించారు. యాసంగిలో పాకాల, రంగాయచెరువు, డీబీఎం 30, 38, 40 కాల్వల కింద సాగైన వరి పంట సాధారణంగా వచ్చే దిగుబడితో పోల్చితే 15శాతం అధికంగా వచ్చిం దని చెప్పారు.
రైతుల పంటను దేశంలోనే కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కరోనా బాధితులకు ప్రభుత్వం అండగా నిలబడి మెరుగైన వైద్యం అందిస్తున్నదన్నారు. ఇంతటి విపత్తులోనూ ముందు చూపుతో నర్సంపేట ప్రభుత్వ వైద్యశాలలో ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు సరిపడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మరో 10 రోజుల్లో నర్సంపేటలో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమా ల్లో నర్సంపేటలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, ఆర్డీవో పవన్కుమార్, తహసీల్దార్ రామ్మూర్తి, ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, సర్పంచ్లు భాషబోయిన అయిలయ్య, సుమన్, డీటీ సృజన్కుమార్, ఆర్ఐ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.