హత్నూర, మే 25: పెండ్లింట విషాదం నెలకొన్నది. సంగారెడ్డి జిల్లా హత్నూరలో వివాహం జరిగిన రెండు రో జులకే వరుడు గుండెపోటుతో కన్నుమూశాడు. కడల అశోక్(24)కు పుల్కల్ మండలంలోని ఓ యువతితో ఆదివారం పెండ్లి జరిగింది. ఆ తర్వాత వధూవరులు హత్నూరకు వెళ్లారు. మంగళవారం అశోక్ ఛాతినొప్పితో కుప్పకూలిపోయాడు. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా.. గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అశోక్ తండ్రి చిన్నప్పుడే చనిపోగా.. అతన్ని తల్లి లక్ష్మి అల్లారుముద్దుగా పెంచింది.