వర్ధన్నపేట, మే 25: బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కరోనా పోరులో తలొంచింది. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాలలో కరోనాతో ఓ బాలింత మృతిచెందింది. గ్రామానికి చెందిన మౌనిక (21)కు సోమవారం రాత్రి పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం మౌనిక పాపకు జన్మనిచ్చి.. ఆ తర్వాత మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. కరోనాతో ఇంటి వద్దే మందులు వాడుతున్న ఆమె.. తాజాగా ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోయి ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు.