టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలు నారప్ప, దృశ్యం 2, ఎఫ్3. వీటిలో నారప్ప, దృశ్యం 2 చిత్రాలు ఇప్పటికే పూర్తయ్యాయి. అసురన్ కు రీమేక్ గా తెరకెక్కిన నారప్ప ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా..లాక్డౌన్ ఎఫెక్ట్ తో వాయిదా పడ్డది. ఎఫ్ 3 షూటింగ్ దశలో ఉంది. మరోవైపు దృశ్యం 2ను కేవలం 45 రోజుల్లోనే కంప్లీట్ చేశాడు. ఈ మూవీకి అమెజాన్ ప్రైమ్ నుంచి మంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయట.
ఈ నేపథ్యంలో తొలుత దృశ్యం 2 విడుదల చేసి, థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత నారప్పను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడట వెంకీ. ఇక ఈ 2 చిత్రాల తర్వాత ఎఫ్ 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వెంకీ సినిమాల షెడ్యూల్లో మార్పులు చేర్పులు చేసిందన్నమాట.
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!