అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడి తీరంవైపు దూసుకొస్తున్న యాస్ తుఫాన్ మే 26న ఒడిశా తీరంలో తీరాన్ని తాకనుంది. ఈ నేపథ్యంలో నేడు, రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంటుందన్నారు.
సముద్రంలో అలలు 2.90-4.5 మీటర్ల ఎత్తులో ఎగసి పడతాయన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. తీర ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు హెచ్చరించారు.