రెండు దశాబ్ధాలకు పైగా తన అందచందాలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్న అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్. పదేళ్ల కూతురు ఉన్నప్పటికీ అంతే గ్లామర్ని మెయింటైన్ చేస్తూ ఇటు పర్సనల్ అటు ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతుంది.అయితే ఆదివారం తన తల్లి వ్రిందా రాయ్ బర్త్ డే కావడంతో ఆమెకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది ఐష్. కేక్స్, ఫ్లవర్స్ తో పాటు తన ఫ్యామిలీని తీసుకొని వెళ్లి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసింది.
70వ బర్త్డే జరుపుకుంటున్న అమ్మకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు అని తెలియజేస్తూ ఐశ్వర్యరాయ్ తన సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలు నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అమ్మమ్మతో ఆద్య దిగిన ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత ఏడాది అమితాబ్ బచ్చన్, అభిషేక్, ఐశ్వర్యరాయ్,ఆరాధ్య ఇలా బచ్చన్ ఫ్యామిలీ అంతా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.