హుజూరాబాద్ టౌన్, మే 23: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, యువకులు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని, ఇకపై కూడా ఉంటారని టీఆర్ఎస్వీ హుజూరాబాద్ నియోజకవర్గ సెక్రటరీ కొలిపాక అజయ్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్ఎస్లో ఉండి ఈటల రాజేందర్ అనుచరులు కొందరు సోషల్ మీడియా వేదికగా పార్టీపై అనుచిత వాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. 2001 నుంచి టీఆర్ఎస్లో కొనసాగుతున్న నాయకులు, కార్యకర్తలు నేటికీ పార్టీలోనే ఉన్నారని వెల్లడించారు. తెలంగాణలో పటిష్టమైన పార్టీగా ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని.. కొందరు నాయకులు పార్టీ మారగానే కార్యకర్తలు వారివెంట వెళ్లలేదని పేర్కొన్నారు.