న్యూఢిల్లీ: 2008లో ముంబైపై పాక్ ఉగ్రవాదులు దాడులకు తెగబడినప్పుడు (28/11 ఘటనలో) వారిని తుదముట్టించటానికి జరిపిన కమెండో ఆపరేషన్కు నేతృత్వం వహించిన జనరల్ జేకే దత్ కరోనాతో మరణించారు. జనరల్ దత్ (72) నేషనల్ సెక్యురిటీ గార్డ్ మాజీ డైరెక్టర్ జనరల్గా పని చేశారు. కరోనాతో గురుగావ్లోని దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం గుండెపోటు రావడంతో మరణించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్కు కరోనా
కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యకు కరోనా పాజిటివ్గా తేలింది. ఆయన హోం-ఐసోలేషన్లో ఉన్నారు.నాజల్ ఎండోస్కోపీతో బ్లాక్ ఫంగస్ గుర్తింపు
భోపాల్, మే 19: కరోనా రోగుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కొవిడ్ రోగులకు ‘నాజల్ ఎండోస్కోపీ’ పరీక్షలు నిర్వహించనున్నట్టు బుధవారం వెల్లడించింది.
నేపాల్లో భూకంపం
కాఠ్మండు: నేపాల్ను భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్పై 5.8 తీవ్రతతో బుధవారం ఉదయం లామ్జంగ్ జిల్లాలో భూప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో ఆరుగురు గాయపడ్డారు. డజన్ల సంఖ్యలో ఇండ్లు కూలిపోయాయి.