న్యూఢిల్లీ: దేశంలో దాదాపు నెల రోజులపాటు కరాళ నృత్యం చేసిన కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఒక దశలో కొన్ని రోజులపాటు వరుసగా రోజువారీ కొత్త కేసుల సంఖ్య 4 లక్షల మార్కును దాటగా.. ఇప్పుడు ఆ సంఖ్య క్రమంగా 3 లక్షల దిగువకు చేరింది. గత రెండు మూడు రోజుల నుంచి వరుసగా మూడు లక్షలకు తక్కువగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి.
అయితే, దేశంలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నప్పటికీ రోజువారీ కరోనా నిర్ధారణ పరీక్షల ప్రక్రియ మాత్రం వేగంగా కొనసాగుతున్నదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR) వెల్లడించింది. మంగళవారం కూడా కొత్తగా 20,08,296 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. దాంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 32 కోట్ల మార్కును దాటి 32,03,01,177కు చేరిందని ICMR పేర్కొన్నది.
పామును పట్టుకుని.. లుంగీలో వేసుకుని..!
గుండె నొప్పి వస్తే తొలి గంటే కీలకం..!