జడ్చర్ల టౌన్, మే17 : పట్టణంలో 6వ రోజు లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. సోమవారం ఉదయం 6 నుం చి 10 గంటల వరకు నిత్యావసర వస్తువులు కొనేందుకు ప్రప్రశాంతంగా లాక్డౌన్జలు బారులుతీరారు. 10 గంటల తర్వాత అన్ని రకా ల దుకాణాలు మూసివేయడంతో ఒక్కసారిగా రహదారులన్నీ నిర్మానుష్యమయ్యాయి. పోలీసులు తనీఖీలు ము మ్మరం చేశారు. ప్రధాన రహదారులు, వీధులు, కూడళ్ల వ ద్ద పోలీసులు పహారా కాశారు. అత్యవసర పనుల కోసం వెళ్లే వారిని మాత్రమే అనుమతించారు. అనవసరంగా రో డ్లపైకి వచ్చే వాహనదారులకు జరిమానాలు విధించారు. మహబూబ్నగర్ డీఎస్పీ శ్రీధర్ జడ్చర్ల పోలీస్స్టేషన్ను సందర్శించి లాక్డౌన్ అమలు తీరు గురించి స్థానిక పో లీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మరింత కఠినంగా…
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 17 : జిల్లాలో లాక్డౌన్ నిబంధనలను మంగళవారం నుంచి మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఇందుకుగానూ అదనంగా పెట్రోలింగ్ బలగాలను నియమించారు. కుంటి సాకులతో అనవసరంగా బయట తిరిగే వారిపై జరిమానాతోపాటు కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయాలని ఎస్పీ వెంకటేశ్వర్లు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. జిల్లాలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన విషయమై పోలీసు శాఖ ఇప్పటికే 2724 కేసులు నమోదు చేయగా, ఉదయంవేళ కేటాయించిన వెసులుబాటు సమయం 6నుంచి 10గంటల మధ్య మాస్కులు ధరించకుండా బయటకు వచ్చేవారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని పోలీసు శాఖ నిర్ణయించినట్లు తెలుస్తున్నది.
కొనసాగుతున్న లాక్డౌన్
నారాయణపేట రూరల్, మే 17 : పట్టణంలో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతున్నది. ఉదయం 10గంటల తర్వాత పోలీసులు, మున్సిపల్ అధికారులు పట్టణంలోని వివిధ కూడళ్లు, దుకాణ సముదాయాలు, కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాల్లో తిరుగుతూ లాక్డౌన్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకొంటున్నారు. అంబేద్కర్చౌరస్తా, సత్యనారాయణ చౌరస్తా, వీరసావర్కర్ చౌర స్తా, చౌక్బజార్ తదితర ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు, ఎస్సై సైదయ్య, పోలీసు సిబ్బంది నిబంధనలు అతిక్రమిస్తున్న వారికి జరిమానా విధిస్తున్నారు.
పక్కాగా అమలు
మహబూబ్నగర్ మే 17: కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ పక్కాగా అమలవుతున్నది. సోమవారం యథావిధిగా ఉదయం 6నుంచి 10 గంటల వరకు వ్యాపార లావాదేవీలు కొనసాగాయి. కొన్ని దుకాణాలు జనంతో రద్దీగా కనిపించాయి. సకాలంలో తమకు కావాల్సిన వస్తువులు, సరుకులను కొనుగోలు చేసి తమ ఇండ్లకు వెళ్లేందుకు ప్రజలు ఉరుకులు, పరుగులు పెట్టారు. 10గంటల నుంచి దుకాణాలను మూసివేయగా, రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కాగా, లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.