హైదరాబాద్, మే 14: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న ఓమ్ ప్రకాశ్ మిశ్రాకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పదొన్నతి లభించింది. ఈ నియామకం వెంటనే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన మిశ్రా..2019 నుంచి హైదరాబాద్ సర్కిల్ హెడ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే హైదరాబాద్ సర్కిల్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న అజయ్ కుమార్ సింగ్కు చీఫ్ జనరల్ మేనేజర్గా పదొన్నతి లభించింది.