కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు పాతనగరం ప్రజల నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నది. నగర నలుమూలలా లాక్డౌన్ను పక్కాగా అమలు చేయడంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. లాక్డౌన్కు సడలింపు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కావడంతో ఆ సమయంలోనే తమకు కావాల్సిన వస్తువులను కొనేందుకు బయటకు వెళ్లారు. ఉదయం 10 గంటల తరువాత పాతనగరంలోని రోడ్లన్నీ ఖాళీగా కన్పించాయి. రంజా న్ మాసం అయినా కూడా నిర్ణీత సమయానికి తమ షాపింగ్లను పూర్తి చేసుకొని పాతనగరవాసులు ఇండ్లకు చేరుకున్నారు. కరోనా కట్టడికి అందరం కలిసికట్టుగా పోరాడాలనే ప్రభుత్వ పిలుపునకు ప్రజలు కూడా సహకరిస్తుండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
పాతనగరంలో లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని దక్షిణ మండల డీసీపీ గజరావ్ భూపాల్ తెలిపారు.. ప్రజలు రోడ్లపై సంచరించకుండా పాతనగర వ్యాప్తంగా 36 చెక్పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. రంజాన్ చివరి రోజున ఈద్గాలతోపాటు మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగించడానికి ఎవరికి అనుమతులు లేవని.. ఇందుకు ముస్లిం సోదరులు సహకరించాలని కోరారు.