జడ్చర్లటౌన్, మే 12 : కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతిఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు పాటి స్తూ కరోనాను జయిద్దామంటూ జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ దోరెపల్లి లక్ష్మి చెప్పారు. బుధవారం మున్సిపాలిటీలోని మున్సిపల్ కా ర్యాలయం నుంచి నేతాజీ చౌరస్తా వరకు అగ్నిమాపకశాఖ సహకారం తో నిర్వహించిన హైపోక్లోరైట్ ద్రావణాన్ని లక్ష్మీ పిచికారీ చేశారు. హౌసింగ్ బోర్డుకాలనీలో శానిటైజేషన్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని, ఎప్పటికప్పుడూ శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో అన్ని వార్డుల్లో శానిటైజేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. లాక్డౌన్కు ప్రజలందరూ సహకరించాలని, అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత, కౌన్సిలర్లు సతీశ్ ముదిరాజ్, చైతన్యచౌహాన్, టీఆర్ఎస్ నాయకుడు దోరెపల్లి రవీందర్, ము న్సిపల్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.