నిరాడంబంగా దర్గా ఉత్సవాలు ప్రారంభం

- కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి
కాజీపేట, అక్టోబర్ 14 : హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఉత్సవాలు బుధవా రం రాత్రి నిరాడంబంగా ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో సందల్ వేడుకల మొదటిరో జు కొద్దిమంది భక్తులతో ఊరేగింపు ప్రశాంతంగా సాగింది. దర్గా కాజీపేట, దర్గా జాగీర్లోని (బడేఘార్)లో బియాబానీ కుటుంబానికి చెందిన మ హిళలు ఉదయం నుంచి రాత్రి వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో గంధం తీసి వెండి గిన్నెలో భద్రపర్చారు. సందల్లో కార్యక్రమంలో భాగంగా బడేఘార్లో దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా పలువురి తో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం పీఠాధిపతి గంధం వెండి గిన్నెను తలపై పెట్టుకుని దర్గా కు తీసుకెళ్లారు.
దర్గాలోని సమాధికి గంధలేపనం చేసి ఫూల్ చాదర్ కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉ ర్సు ప్రారంభమైనట్లు ప్రకటించారు. దర్గాలో రా త్రంతా కవ్వాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనల్లో ఉప పీఠాధిపతి భక్తియార్ బా బా, కార్పొరేటర్ అబూబక్కర్, మత గురువులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. కాగా, ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు జరుగకుండా కాజీపేట ఏసీపీ రవీందర్కుమార్ ఆదేశానుసారం సీఐ రా వుల నరేందర్ నేతృత్వంలో ఎస్సైలు అశోక్కుమార్, రవీందర్ బందోబస్తు నిర్వహించారు.
తాజావార్తలు
- చిక్కుల్లో విరాట్ కోహ్లి.. కేరళ హైకోర్టు నోటీసులు
- ఛత్తీస్గఢ్లో 24 మంది నక్సలైట్ల లొంగుబాటు
- స్నానాల గదుల్లోకి దూరి.. యువతుల లోదుస్తులు చించి..
- వేటగాళ్ల ఉచ్చుకు పులి మృత్యువాత
- ఆన్లైన్ క్లాస్లో టీచర్ను బురుడీ కొట్టించిన స్టూడెంట్
- ఆచార్యకు స్టార్ హీరో వాయిస్ ఓవర్..!
- హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు గుడ్న్యూస్
- ఆ ఆరోపణలు క్రేజీగా ఉన్నాయి: బిల్ గేట్స్
- ప్రియురాలితో గొడవపడి సముద్రంలో దూకిన యువకుడు
- పల్లె ప్రకృతివనం, ట్రాఫిక్ సిగ్నల్స్ను ప్రారంభించిన మంత్రి