చిన్నకోడూరు, ఏప్రిల్ 27 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం సీఎం కేసీఆర్ ప్రాణాలనే పణంగా పెట్టారని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ అన్నారు. మంగళవారం చిన్నకోడూరు మండలం చంద్లాపూర్లో టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణశర్మ మాట్లాడారు. 2001లో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారన్నారు. అయినప్పటికీ ప్రజల ఆకాంక్ష కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం.. కేసీఆర్ సీఎం అయ్యాక.. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఎన్నో పథకాలు రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రకళ రవిగౌడ్, ఎంపీటీసీ దుర్గారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ చంద్రమౌళిగౌడ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు లింగం పాల్గొన్నారు.