పనాజీ : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో బుధవారం రాత్రి పది గంటల నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. కర్ఫ్యూ సమయంలో బార్లు, రెస్టారెంట్లు, క్యాసినోలు, సినిమా హాళ్లు మూతపడతాయి. ఏప్రిల్ 30 వరకూ రాత్రి పదిగంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
అత్యున్నత స్థాయి భేటీ అనంతరం ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ఈ విషయం వెల్లడించారు. పరిశ్రమలు, పెట్రోల్ బంకులు , నిత్యావసరాల సరఫరాలను కర్ఫ్యూ నుంచి మినహాయించామని సీఎం తెలిపారు. కర్ఫ్యూ వేళల్లో ప్రజలను రోడ్లపైకి అనుమతించబోమని చెప్పారు.