పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్కు తీర్మానాలు
మాస్కులు ధరించని వారికి జరిమానాలు
షాద్నగర్రూరల్,ఏప్రిల్ 18: ఫరూఖ్నగర్ మండలంలోని పలు గ్రామాల్లో రోజురోజుకూ కరోనా విజృంభిస్తుడటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.మండలంలోని ఎలికట్ట, మొగిలిగిద్ద గ్రామాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఆయా గ్రామసర్పంచ్లు, గ్రామస్తులతో కలిసి లాక్డౌన్ విధించేందుకు తీర్మానాలు చేసి లాక్డౌన్ కొనసాగిస్తున్నారు.ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరిచి ఉంచాలని తీర్మానం చేశారు. అత్యవసర సమయాల్లో తప్ప బయటకు రావద్దని గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా మాస్కు ధరించకుంటే రూ.1000జరిమానా విధించేలా చర్యలు తీసుకుంటు న్నారు. గ్రామాల్లో రసాయనాలను వీధుల్లో పిచికారీ చేస్తున్నారు. బయట వ్యక్తులు ఎవరూ గ్రామాలకు రావొద్దని గ్రామస్తులు బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు.
పెద్ద ఎల్కిచర్లలో లాక్డౌన్
కొందుర్గు, ఏప్రిల్ 18: జిల్లెడు చౌదరిగూడ మండలంలోని పెద్ద ఎల్కిచర్ల గ్రామం లో గ్రామసభ ఏర్పాటు చేసి ఆదివారం నుంచి లాక్డౌన్ విధిస్తున్నట్లు పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు సర్పంచ్ భూపాలచారి తెలిపారు. గ్రామంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. గ్రామంలోని దుకాణాలు ఉదయం 6:30గంటల నుంచి 9:30వరకు సాయంత్రం 5:30ల నుంచి 7:30లకు మాత్రమే తెరిచి ఉంచాలన్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సర్పంచ్ సూచించారు. లేదంటే రూ.1000 జరిమానా విధించనున్నట్లు ఆయన తెలిపారు.కార్యక్రమంలో ఎంపీటీసీ మంగమ్మ, నాయకులు రాంచంద్రయ్య, కిష్టమ్మ, బాల్రాజు, లక్ష్మయ్య, భీమయ్య పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కొండపల్లి ఘటనలో బీజేపీ నాయకులతో పాటు మరో 20 మంది అరెస్టు
పదమూడో రోజూ మత్తడి దుంకుతున్న హల్దీవాగు