న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా(68) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో చనిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. రంజిత్ సిన్హాకు కరోనా సోకినట్టు గురువారం రాత్రే నిర్ధారణ అయింది. ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నారు. 1974 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రంజిత్ సిన్హా 2012లో సీబీఐ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు.