నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్లోని హిల్ కాలనీకి చెందిన జిల్లా టీడీపీ వైస్ ప్రెసిడెంట్ కుత్బుద్దిన్ హోంమంత్రి మహమూద్ అలీ సమీక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ..
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ముస్లిం, మైనారిటీలకు షాదీ ముబారక్, విదేశాలలో మైనారిటీ పిల్లలకు చదువు, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, కార్ లోన్స్ లాంటి సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు.
సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మసిఉల్లహ ఖాన్, ఆర్షద్ అలీ ఖాన్, జిలానీ, తహెర్, నసీర్, హాబీబ్, సమీరుద్దీన్ , రబ్బానీ, సల్మాన్ , అజ్గర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
దివ్యాంగులకు అండగా ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారు
మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ : మంత్రి కొప్పుల