చండీఘర్ : చండీఘర్లోని సెక్టార్ 34ఏ లోని యాక్సిస్ బ్యాంకులో నిన్న సాయంత్రం భారీ చోరీ జరిగింది. నిన్న సాయంత్రం 5:30 గంటలకు బ్యాంకులో రూ. 4 కోట్లు చోరీ జరిగినట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు వద్ద విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డే నగదును దొంగిలించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ సెక్యూరిటీ గార్డు కోసం పోలీసులు గాలిస్తున్నారు.