ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతోన్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 7 వద్ద ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరారు. ఆవేశ్ ఖాన్ వేసిన రెండో ఓవర్లో డుప్లెసిస్(0) ఔట్ కాగా.. క్రిస్ వోక్స్ వేసిన తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(5) పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం మొయిన్ అలీ(11), సురేశ్ రైనా(14) క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లకు చెన్నై 2 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది.