స్కూల్లో పాఠాలు సరిగ్గా వినకపోతే టీచర్లు వార్నింగ్ ఇస్తారు. అయినా మారకపోతే క్లాస్ నుంచి బయటకు పంపించేస్తారు. లేదా ఇంకేదైనా పనిష్మెంట్ ఇస్తారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు స్కూల్ స్ట్రక్చరే మారిపోయింది. ఇప్పుడు క్లాసులు అన్నీ జరిగేది ఆన్లైన్లోనే! మరి ఆన్లైన్లో క్లాసులు జరుగుతున్నప్పుడు పిల్లలు శ్రద్ధగా వింటున్నారా ! లేదా ! అనేది ఇప్పుడు టీచర్లకు పెద్ద తలనొప్పిలా మారింది. మరి ఈ జూమ్ క్లాసులు జరిగేటప్పుడు పిల్లల్లో అటెన్షన్ తీసుకురావడం ఎలా? ఇలా స్టూడెంట్ ప్రవర్తనతో విసిగిపోయిన ఓ టీచర్.. సదరు విద్యార్థిని జూమ్ కాల్ నుంచి డిటెండ్ చేసింది. వినడానికి విడ్డూరంగా ఉన్న పాఠాలపై శ్రద్ధ పెట్టని ఓ స్టూడెంట్ను టీచర్ జూమ్ డిటెన్షన్ చేయడం మాత్రం వైరల్గా మారింది.
నాల్గో తరగతి చదువుతున్న తన కూతురును జూమ్ డిటెన్షన్ చేసిన విషయాన్ని పెన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఉజు అన్య ట్విటర్ ద్వారా తెలియజేసింది. తన స్టూడెంట్కు జూమ్ క్లాస్ లింక్ ఓపెన్ కాకుండా చేశారని తన బాధను చెప్పుకొచ్చింది. నిజానికి తన కూతురు ప్రవర్తన గురించి సదరు టీచర్ ఇంతకుముందు చాలాసార్లు తనకు కంప్లయింట్ చేసినట్టు వరుస ట్వీట్లలో తెలిపింది. సరిగ్గా క్లాసులు వినకుండా కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేసేదని తన ట్వీట్లో చెప్పుకొచ్చింది. నిజానికి కరోనా మహమ్మారి కారణంగా మనలానే తాను కూడా ఇబ్బంది పడుతుందని పేర్కొంది. నాల్గో గ్రేడ్ చదువుతున్న చిన్నారి జూమ్ లో అంతసేపు క్లాసులు వినడం చాలా కష్టమైన పనే అని చెప్పింది. అయితే ఈ విషయంలో నేను టీచర్ను తప్పుపట్టాలని అనుకోవట్లేదు కానీ జూమ్ డిటెన్షన్ మాత్రం తెలివి తక్కువ నిర్ణయమని పేర్కొంది. ఉజు అన్య ట్వీట్తో ఆమెకు చాలామంది నెటిజన్లు మద్దతు పలికారు. ఆన్ లైన్ క్లాసుల వల్ల పిల్లలు చాలాసేపు స్క్రీన్ ముందు ఉండాల్సి వస్తుందని, దీంతో వారు ఇబ్బంది పడుతున్నారని కామెంట్లు చేశారు. తన ట్వీట్పై స్పందించిన నెటిజన్లకు ధన్యవాదాలు తెలిపిన అన్య.. ఇకపై తన కూతురికి తానే క్లాసులు చెప్పుకుంటానని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రూ.95 ఇన్వెస్ట్తో రూ.14 లక్షలు! ఎలాగంటే!!
మిసెస్ శ్రీలంక వరల్డ్ అరెస్టు
భార్య ప్రేమతో బాక్స్ కట్టిస్తే ఫాస్ట్ఫుడ్ లాగించేందుకు భర్త..
వారం రోజుల్లోనే పవర్ స్టార్ సినిమా OTTలో విడుదల..
104 ఏండ్ల వయసులో రెండోసారి కరోనాను జయించి..