గౌహతి: అస్సాంలోని ఒక పోలింగ్ బూత్లో భారీగా రిగ్గింగ్ జరిగిన విషయం బయటపడింది. డిమా హసావో జిల్లాలోని ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 90 మంది ప్రజలు ఓటు నమోదు చేసుకున్నారు. అయితే ఏప్రిల్ 1న జరిగిన రెండో దశ పోలింగ్లో ఈ బూత్లో 181 ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థి బిర్ భద్ర హగ్జర్ పోటీ చేసిన నియోజకవర్గం పరిధిలో ఈ పోలింగ్ బూత్ ఉన్నది. ఇక్కడ భారీగా జరిగిన రిగ్గింగ్ను గుర్తించిన ఎన్నికల సంఘం ఆరుగురు అధికారులను సస్పెండ్ చేసింది. రీ పోలింగ్ ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధమైంది.
కాగా, కరీంగంజ్ జిల్లాలో రెండో దశ పోలింగ్ తర్వాత బీజేపీ అభ్యర్థి కృష్ణేండు పాల్కు చెందిన వాహనంలో ఈవీఎంను తరలించిన ఘటన కలకలం రేపింది. ఈ నేథ్యంలో నలుగురు అధికారులను సస్పెండ్ చేయడంతోపాటు రతాబరి నియోజకవర్గం పరిధిలో రీపోలింగ్కు ఈసీ ఆదేశించింది.