అమరావతి : ఏపీలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1398 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 787 మంది కోలుకున్నారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,05,946కు చేరింది. 8,89,295 మంది చికిత్సకు కోలుకున్నారు. 9417 యాక్టివ్ కేసులుండగా.. 7234 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం 31,260 శాంపిళ్లను పరీక్షించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి