న్యూఢిల్లీ, మార్చి 30: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు మంగళవారం ఢిల్లీలోని ఎయిమ్స్ దవాఖానలో గుండె శస్త్ర చికిత్స (కార్డియాక్ బైపాస్ సర్జరీ) జరిగింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. శస్త్ర చికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం రాష్ట్రపతి ఆరోగ్యం నిలకడగా ఉన్నదని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. కోవింద్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు వివరించాయి. ఛాతిలో అసౌకర్యంగా ఉండటంతో రాష్ట్రపతికి ఆర్మీ దవాఖానలో శుక్రవారం పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్యుల సూచనల మేరకు శనివారం ఆయనను ఎయిమ్స్కు తరలించారు.
ఇవి కూడా చదవండి:
పాముల్లా మనుషులు విషాన్ని చిమ్ముతారా?
కమ్యూనిస్టుల ‘కార్పొరేట్ మ్యానిఫెస్టో’
బీహార్లో 2 అగ్ని ప్రమాదాల్లో 9 మంది పిల్లల సజీవ దహనం
అమ్మాయిలూ.. రాహుల్తో జాగ్రత్త!
ఎయిర్పోర్టుల్లో మాస్కులు ధరించకపోతే అక్కడే ఫైన్
రైళ్లలో రాత్రిపూట చార్జింగ్ బంద్