శ్రీనివాస్నగర్: జగద్గిరిగుట్ట పరిధిలోని శ్రీనివాస్ నగర్లో యువకుడి దారుణ హత్యకు సంబంధించిన కేసును పోలీసులు చేధించారు. కేసుకు సంబంధించి మొత్తం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఇమ్రాన్ (21)కు మురళి, శ్రీకాంత్ అనే మరో ఇద్దరు వ్యక్తులు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇమ్రాన్, మురళి, శ్రీకాంత్ ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
ఈ నెల 19న (శుక్రవారం) శ్రీనివాస్నగర్ ఏరియాలో నవాజ్ (23) అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఇమ్రాన్ అనే యువకుడు నవాజ్ను నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపాడు. ఇమ్రాన్, నవాజ్ ఇద్దరూ ఆటో డ్రైవర్లే. వారి మధ్య గతంలో గొడవ జరిగింది. ఆ పాతకక్షల నేపథ్యంలో గత శుక్రవారం ఇమ్రాన్ పక్కాప్లాన్ చేసి నవాజ్ను హతమార్చాడు. అందుకు అతని స్నేహితులైన మురళి, శ్రీకాంత్ల సహకారం తీసుకున్నారు. కాగా, పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే కేసును చేధించారు.