న్యూఢిల్లీ: దేశంలో గత రెండు నెలలుగా వేగంగా పడిపోయిన పసిడి ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. వారంలో క్రితం రూ.43 వేల దిగువకు చేరిన తులం పసిడి ధర.. గత నాలుగు రోజులుగా కొద్దికొద్దిగా పెరుగుతూ రూ.44,500 మార్కును దాటింది. ఢిల్లీలో ఇవాళ 99.9 స్వచ్చత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.60 పెరిగి రూ.44,519కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,459 వద్ద ముగిసింది. ఇదిలావుంటే వెండి ధర ఇవాళ స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.200 తగ్గి రూ.66,536కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.66,736 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,735 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26 అమెరికన్ డాలర్లు పలికింది.