భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతార్పూర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. జిల్లాలోని గువారా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంద్రప్రతాప్ సింగ్ పర్మార్ (45)ను దుండగులు అతి సమీపం నుంచి కాల్చిచంపారు. మంగళవారం రాత్రి బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపి పారిపోయారు. స్థానికులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.
కాగా ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఆరుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పాతకక్షలే పర్మార్ హత్యకు కారణమని తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు వెల్లడించారు. ఇదిలావుంటే పర్మార్ హత్యతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన అచరులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రిని ధ్వంసం చేశారు. పరిసర ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించారు. పర్మార్ హత్యపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కమల్నాథ్, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు.