నాలుగో రోజు రూ.1.37 కోట్లు

వరంగల్ కల్చరల్, ఫిబ్రవరి 15: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు బుధవారం ప్రారంభం కాగా, శనివారం నాలుగో రోజూ కొనసాగింది. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో శనివారం అధికారులు 53 హుండీలను లెక్కించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన లెక్కింపు సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. ఈ సందర్భంగా రూ.1,37,70,000 ఆదాయం వచ్చినట్లు మేడారం ఆలయ ఈవో తమ్మ రాజేంద్రం వెల్లడించారు. తొలి రోజు రూ.1,01,50,000, రెండోరోజు 1,91,26,000, మూడో రోజు 2,70,16,000 ఆదాయం వచ్చిందన్నారు. నాలుగో రోజుతో కలుపుకుని మొత్తం రూ.7,00,62,000 ఆదాయం సమకూరినట్లు చెప్పారు. జాతర సమయంలో వర్షం కురిసిన కారణంగా ప్రతి హుండీలో భక్తుల కానుకలు తడిసిపోయాయి. ఈ క్రమంలో కొన్ని నోట్లు తడిసిపోయి ముక్కలవుతున్నాయి. తడిగా ఉన్న నోట్లను వలంటీర్లు గాలికి ఆరబెడుతున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య హుండీల లెక్కింపు కొనసాగుతోంది.
తాజావార్తలు
- కరోనా టీకా తీసుకున్న ఆశా వర్కర్కు అస్వస్థత
- క్లినిక్ బయట ఫొటోలకు పోజులిచ్చిన కోహ్లి, అనుష్క
- మీర్జాపూర్ టీంకు నోటీసులు.. అమెజాన్ ప్రైమ్కు మరిన్ని కష్టాలు..!
- కోబ్రా ఫోర్స్లోకి మహిళల్ని తీసుకుంటున్నాం..
- శాండల్వుడ్ డ్రగ్ కేసు.. నటి రాగిణి ద్వివేదికి బెయిల్
- షార్ట్సర్య్కూట్తో యూరియా లారీ దగ్ధం
- రైల్వే కార్మికులతో స్నేహభావంగా మెలిగాం : మంత్రి కేటీఆర్
- పీపీఈ కిట్లో వచ్చి 13 కోట్ల బంగారం దోచుకెళ్లాడు
- కాబోయే సీఎం కేటీఆర్కు కంగ్రాట్స్ : డిప్యూటీ స్పీకర్ పద్మారావు
- హరిహరన్ మెడలోని డైమండ్ చైన్ మాయం..!