కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పలువురు ఎమ్మెల్యేలు
గద్వాల, మార్చి 13 : జిల్లా కేంద్రంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేశవ్, నిజామాబాద్ డీసీఎంఎస్ చైర్మన్ మోహన్ కేక్ కట్ చేసి కవితకు జన్మది న శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో నిర్వహించుకోవాలని కో రారు. ఆమె ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండి రాజకీయాల్లో అత్యున్నత స్థానాలు అధిరోహించాలని కాంక్షించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, రిటైర్డు హెచ్ఎం కృష్ణయ్య, కేటీఆర్ యువసేన జిల్లా ప్ర ధాన కార్యదర్శి కృష్ణకుమార్రెడ్డి నాయకులు శివరామిరెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటన్న, నరేందర్, పరశురాముడు, చంటి, మహేశ్ పాల్గొన్నారు.
దివ్యాంగుల భవనంలో..
అచ్చంపేట రూరల్, మార్చి 13 : ఎంపీ కవిత పుట్టినరోజు వేడుకలను పట్టణంలోని దివ్యాంగుల భవనంలో ఘనంగా నిర్వహించారు. జాగృతి సం స్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాల్రాజు హాజరై కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మున్సిపల్ చైర్మన్ తులసీరాం, నాయకులు నర్సింహాగౌడ్, సత్యం, రాజశేఖర్ పాల్గొన్నారు.
వేడుకల్లో ఎమ్మెల్యే అబ్రహం
ఉండవెల్లి, మార్చి 13 : ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అబ్రహం, మాజీ ఎంపీ మంద జగన్నా థం ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.
కల్వకుర్తిలో..
కల్వకుర్తి, మార్చి 13 : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ జాగృతి వ్య వస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్, కల్వకుర్తి నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల ఇన్చార్జి ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మ న్ ఎడ్మ సత్యం, మాజీ చైర్మన్ శ్రీశైలం, మార్కెట్ చైర్మన్ బాలయ్య, వైస్ చైర్మన్ విజయ్గౌడ్, వైస్ ఎంపీపీ గోవర్ధన్, వెల్దండ రైతుబంధు సమితి అ ధ్యక్షుడు భూపతిరెడ్డి, జంగయ్య, రాజు, గణేశ్, ఆ నంద్, రమేశ్, కిశోర్, శేఖర్, శ్రీకాంత్ ఉన్నారు.
ఎమ్మెల్యే చిట్టెం ఆధ్వర్యంలో..
మక్తల్ టౌన్, మార్చి 13 : పట్టణంలోని ఎమ్మె ల్యే నివాసంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమక్షంలో ఎమ్మెల్యే కేక్ కట్ చేసి నిజామాబాద్ డీసీసీబీ భాస్కర్రెడ్డికి తినిపించారు. కార్యక్రమంలో డీసీసీబీ నిజాంపాషా, బాన్సువాడ పా క్స్ చైర్మన్ శ్రీధర్, శ్రీనివాస్గుప్తా, నాయకులు మ హిపాల్రెడ్డి, శేఖర్రెడ్డి, రామలింగం, గోవర్ధన్, నే తాజీ, ఈశ్వర్, నర్సింహారెడ్డి, చెన్నయ్య ఉన్నారు.