హైదరాబాద్: ఆసియా-పసిఫిక్ దేశాలకు సుమారు వంద కోట్ల డోసుల టీకాలను పంపిణీ చేయాలని క్వాడ్లో భాగమైన అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు నిర్ణయించాయి. భారీ మొత్తంలో కరోనా టీకాలు ఉత్పత్తి చేసేందుకు హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ ఫార్మా సంస్థ.. ఆ మెగా కార్యక్రమంలో భాగస్వామి అయినట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(డీఎఫ్సీ).. ఇండియాలో వ్యాక్సిన్ అభివృద్ధి కోసం బయోలాజికల్ ఈ సంస్థకు అవకాశం కల్పించింది. 2022 నాటికి వంద కోట్ల మందికి ఇండో పసిఫిక్ ప్రాంతంలో టీకాలు అందించాలంటే ఇదో కీలక ఒప్పందం అవుతుందని అమెరికా అభిప్రాయపడింది. బయోలాజికల్ ఈ సంస్థకు అమెరికా డీఎఫ్సీ ఫైనాన్స్ చేయనున్నది. దీంతో బయోలాజికల్ ఈ సంస్థ.. తన వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడం వల్ల .. వీలైనంత త్వరలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు టీకాలు అందించవచ్చు అని డీఎఫ్సీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డేవిడ్ మార్చిక్ తెలిపారు. బయోలాజికల్ ఈ సంస్థను అమెరికా ఎఫ్డీసీ కొనియాడింది. బయోలాజికల్ ఈ సంస్థ.. మహిళాల చేత ఆపరేట్ అవుతున్నట్లు తన ప్రకటనలో పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా లింగసమానత్వాన్ని ప్రమోట్ చేసేందుకు బయోలాజికల్ ఈ సంస్థ ప్రోత్సహిస్తున్నట్లు డీఎఫ్సీ వెల్లడించింది. హైదరాబాద్లోని బయోలాజికల్ ఈ సంస్థను 1953లో స్థాపించారు. ఆ సంస్థకు అధిపతిగా మహిమ దాట్ల కొనసాగుతున్నారు. ఆ కంపెనీ ఎండీ, సీఈవోగా ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.