గ్రీస్ : ఓ 37 రోజుల పసిబిడ్డను కరోనా మహమ్మారి బలిగొన్నది. ఈ ఘటన గ్రీస్లో చోటు చేసుకుంది. అయితే కరోనాతో పసిపాప మరణించినట్లు గ్రీస్ ప్రధానమంత్రి కైరియాకోస్ మిసోటకిస్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. 37 రోజుల శిశువు 17 రోజుల పాటు కరోనాతో పోరాడి ఓడిపోవడం చాలా బాధాకరమైన విషయమని ప్రధాని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి చిన్నారిని బలి తీసుకోవడం తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందన్నారు. ఈ చిన్నారికి కొద్ది రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, జ్వరం రావడంతో ఏథెన్స్ చిల్ర్డన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. గ్రీస్లో ఇప్పటి వరకు కరోనాతో 6,800 మంది చనిపోయారు. ఐసీయూల్లో 480 మందికి పైగా చికిత్స పొందుతున్నారు.