న్యూఢిల్లీ: దేశంలో విలువైన లోహాల ధరలు మళ్లీ తగ్గాయి. పసిడి ధరలు స్వల్పంగా దిగిరాగా, వెండి ధర భారీగా తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.342 తగ్గి రూ.45,599కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం బంగారం ధర రూ.45,941 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ బంగారం, వెండి కొనుగోళ్లకు పెద్దగా డిమాండ్ లేకపోవడమే దేశీయంగా వాటి ధరలు దిగిరావడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలైతే భారీగా తగ్గాయి. కిలో వెండి ధర ఏకంగా రూ.2,007 తగ్గి రూ.67,419కి పడిపోయింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.69,426 వద్ద ముగిసింది. ఇదిలావుంటే ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,760 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.78 అమెరికన్ డాలర్లు పలికింది.