ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
రూ.1.10 కోట్లు విలువైన రైతుబీమా చెక్కుల పంపిణీ
నర్సంపేట, జూలై 12 : రైతన్నకు భరోసాగా సీఎం కేసీఆర్ నీలుస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నర్సంపేటలో 22 మంది రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.1.10 కోట్లు విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రైతు బతికున్నప్పుడు ఎంత గౌరవంగా బతికారో, చనిపోయాక కూడా అంతే గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో రూ.5 లక్షల బీమాను అందజేస్తున్నదని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నారన్నారు. రైతులకు ఎకరానికి వానకాలం, యాసంగి పంటలకు రూ. 5 వేల చొప్పున మొత్తం రెండు సార్లు రూ. 10 వేలు అందిస్తున్నారని వివరించారు. నర్సంపేట నియోజకవర్గంలో రైతులకు 442 మంది రైతు కుటుంబాలకు రైతుబీమా పథకం వర్తింప చేశామన్నారు. అందే విధంగా రైతుబంధు పథకంలో 66531 మంది రైతులకు రూ.57.18 కోట్లు నగదును అందజేసినట్లు తెలిపారు. రైతులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కా ర్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీలు విజేందర్, ప్రకాశ్రావు, జడ్పీటీసీ సభ్యులు పత్తినాయక్, ఏడీఏ శ్రీనివాస్ రావు, రైతుబంధు సమితి కమిటీ సభ్యు లు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులున్నారు.