వరంగల్ చౌరస్తా, జూలై 11 : వరంగల్ ములుగు రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఒమెగా బన్ను హాస్పిటల్ను గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ప్రారం భించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరంగల్ నగరాన్ని హెల్త్హబ్గా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నందునే అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్కు సైతం చికిత్స అందించడానికి 150 పడకలతో ప్రపంచస్థాయి ప్రఖ్యాతి గాంచిన ఆధునిక యంత్రపరికరాలను ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ను ప్రారంభించడం ఆనందగా ఉందన్నారు. సేవా దృక్పథంతో ప్రజలకు వైద్యసేవలను అందించాలని కోరారు. అనంతరం మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హాజరై హాస్పిటల్లోని యంత్రపరికరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి పీ శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చరణ్జిత్రెడ్డి, డాక్టర్ నిఖిల్రెడ్డి, డాక్టర్ రవీంద్రరెడ్డి, డాక్టర్ వెంకటసింహా, ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.