పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 24: ఒకే కిడ్నీతో జననం.. అనారోగ్యంతో అదీ అంతంత మాత్రంగానే పనిచేస్తోంది. రోజురోజుకూ ఆరోగ్యం దెబ్బ తింటోం ది. కిడ్నీ ప్లాంటేషన్ చేయాలని వైద్యులు చెబుతుండగా, డయాలసిస్ చేయించేం దుకే ఆ కుటుంబానికి చిల్లిగవ్వలేని దుస్థితి. సాఫ్ట్వేర్ మిత్రులతో తాత్కాలిక సా యం అందుతుండగా, తమ కూతురిని బతికించేందుకు ప్రభుత్వంతోపాటు దాతలు ఆదుకోవాలని ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు.
వరంగల్కు చెందిన మహ్మద్ అబ్దుల్లాఖాన్-ఫర్జానాబేగంకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే కూతురు హలీమా సాధియా(13) ఒకే కిడ్నీతో పుట్టింది. నాలుగైదేళ్లుగా అదీ సరిగా పనిచేయక పోవడంతో డయాలసిస్ చేయిస్తూ బిడ్డను బతికించుకోవడానికి తల్లిదండ్రులు శత విధాలా ప్రయత్నిస్తు న్నారు. ఇందుకోసం రూ.5 లక్షల వరకు ఖర్చు చేశారు. హైదరాబాద్లోని ప్రైవే ట్ దవాఖానకు తీసుకువెళ్లగా, తొందరగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని, అందుకు రూ. 30 లక్షల నుంచి 40 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో వారు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. హన్మకొండలోని ఓ బేకరీలో కూలి పనిచేసే తనకు అంత స్థోమత లేదని బాలిక తండ్రి మహ్మద్ అబ్దుల్లా ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. తమకు తోచినంత 7036456455 నంబర్కు ఫోన్ పే, గూగుల్ పే చేయాలని కోరారు.
సాఫ్ట్వేర్ మిత్రుల ద్వారా రూ.లక్షన్నర సేకరణ
కొత్తవాడకు చెందిన వలుస గోపి చెన్నైలో సాఫ్ట్వేర్. కరోనాతో గతేడాది నుంచి వర్క్ ఫ్రం హోం చేస్తున్నా. సామాజిక సేవాగుణం కలిగిన గోపికి కిడ్నీ బాధితురాలి సమాచారం తెలియగానే ఈ నెల ప్రారంభంలో ప్రత్యేకంగా ’మి లాప్ యాప్ ’ఓపెన్ చేసి, తోటి మి త్రుల సహాయం కోసం అప్డేట్ చేశారు. దీంతో చాలామంది మిత్రులు స్పందించడంతో ఇప్పటి వరకు రూ. లక్షా పదివేలపైన యాప్లో జమయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్లో చికిత్స పొందుతున్న హలీమా సాధియా వైద్యం కోసం తాత్కాలికంగా మరో రూ. 25వేలు సేకరించి, కుటుంబసభ్యులకు అందించారు.