వరంగల్, అక్టోబర్19 (నమస్తే తెలంగాణ ప్రతిని ధి): తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి 20 ఏళ్లయిన సంద ర్భంగా నిర్వహిస్తున్న ‘విజయగర్జన సభ’కు ఏర్పాట్లు మొదలయ్యాయి. వరంగల్ నగరంలో నవంబర్ 15న భారీ బహిరంగసభ సభ నిర్వహించాలని టీఆర్ఎస్ అధి నేత కేసీఆర్ నిర్ణయించారు. ఏర్పాట్లు వేగవంతం చేయా లని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్విప్ వినయ్ భాస్కర్ను ఆదేశించారు. 10 లక్షల మందితో ఘనంగా నిర్వహించే సభ ఏర్పాట్ల కోసం వీరిద్దరూ మంగళవారం మరోసారి స్థలాలు పరిశీలించారు. గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ మర్రి యాద వరెడ్డితో కలిసి వారు గ్రేటర్ వరంగల్లోని న్యూశా యంపేట, భట్టుపల్లి, తిమ్మాపూర్ శివార్లలోని ఖాళీ స్థలాలను పరిశీలించారు. 10లక్షల మందితో బహిరంగ సభ, రాష్ట్రవ్యాప్తంగా వచ్చే వాహనాల పార్కింగ్కు అను వైన స్థలాలను గుర్తించారు. రవాణా మార్గాలు, ఇతర ఏర్పాట్లపై నివేదిక రూపొందించి టీఆర్ఎస్ అధిష్ఠానా నికి నివేదించనున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో ఎక్కు వ రోడ్లు అనుసంధానంగా ఉన్న విశాలమైన ఖాళీ స్థలాలను గుర్తించారు.
టీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్కు మొదటి నుంచి సెంటిమెంట్గా నిలిచిన వరంగల్లోనే ద్విదశాబ్ది ఉత్సవాల సభను నిర్వహించాలని పార్టీ అధి ష్ఠానం నిర్ణయించింది. గతంలో వరంగల్ నగరంలోని ప్రకాశ్రెడ్డిపేటలో రెండుసార్లు టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగసభలు జాతీయ స్థాయిలో రాజకీయంగా రికార్డులను నమోదు చేశాయి. విజయగర్జన సభను ఇదే స్థాయిలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ తమను ఆదేశించారని మంత్రి ఎర్రబెల్లి దయాక ర్రావు చెప్పారు. ‘టీఆర్ఎస్ విజయగర్జన సభను 10 లక్షల మందితో భారీ ఎత్తున నిర్వ హించేందుకు అనువైన స్థలాలను గుర్తించాం. వివరాలను పార్టీ అధిష్ఠా నానికి నివేదిస్తాం. టీఆర్ఎస్ను స్థాపించి 20 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ శ్రేణులు, ప్రజలకు విజయగర్జన సభలో వివరిస్తారు’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.